చత్తీస్గఢ్లో విచిత్రమైన పరిస్థతి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 07, 2018

చత్తీస్గఢ్లో విచిత్రమైన పరిస్థతి!


కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాల ఫలితాలు మాత్రం డిసెంబర్ 11నే. దీంతో రాజస్థాన్, తెలంగాణకు డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా నాలుగు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అలాగే మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లోనూ నవంబర్ 28న ఎన్నికలు జరగనుండగా పదిరోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అయితే చత్తీస్గడ్లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ తొలిదశ పోలింగ్ నవంబర్ 12న, రెండో దశ పోలిగ్ నవంబర్ 20న జరుగుతుంది. అంటే తొలిదశ పోలింగ్ పూర్తైన నెల రోజుల తర్వాత ఫలితాలు వెల్లడవుతాయన్నమాట!

No comments:

Post a Comment

Post Bottom Ad