ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని దక్షిణ అమెరికా ఖండ దేశం బొలీవియా చేపట్టింది. 2017 జూన్లో మొదటిసారిగా బొలీవియా భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఆ సమయంలో శాంతి భద్రతలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. చిలీకి వ్యతిరేకంగా బొలీవియా వేసిన దావాపై విచారణ జరిపి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజే) తీర్పు ఇవ్వనున్న సందర్భంగా ఇప్పుడు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఆ దేశానికి చాలా కీలకంగా మారింది. ఐరాసలో బొలీవియా శాశ్వత ప్రతినిధి సచా లోరెంటి మాట్లాడుతూ, శాంతి సందేశంతో భద్రతా మండలిలో వర్కింగ్ ఎజెండా రూపొందిస్తున్నామని చెప్పారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని దక్షిణ అమెరికా ఖండ దేశం బొలీవియా చేపట్టింది. 2017 జూన్లో మొదటిసారిగా బొలీవియా భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఆ సమయంలో శాంతి భద్రతలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. చిలీకి వ్యతిరేకంగా బొలీవియా వేసిన దావాపై విచారణ జరిపి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజే) తీర్పు ఇవ్వనున్న సందర్భంగా ఇప్పుడు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఆ దేశానికి చాలా కీలకంగా మారింది. ఐరాసలో బొలీవియా శాశ్వత ప్రతినిధి సచా లోరెంటి మాట్లాడుతూ, శాంతి సందేశంతో భద్రతా మండలిలో వర్కింగ్ ఎజెండా రూపొందిస్తున్నామని చెప్పారు.
No comments:
Post a Comment