విశాఖ వన్డే.. భారత్‌ జట్టు ఇదే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 23, 2018

విశాఖ వన్డే.. భారత్‌ జట్టు ఇదే

వైజాగ్‌ వేదికగా బుధ‌వారం జ‌రిగే వన్డే మ్యాచ్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా 2వ‌ వన్డే విశాఖ పట్నంవేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. .ఈ మ‌ధ్య కాలంలో మ్యాచ్‌కు ఒక రోజు ముందే 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించే కొత్త సంప్రదాయానికి తెరలేపిన బీసీసీఐ వైజాగ్‌ వన్డే జట్టును కూడా ప్రకటించింది. బుధవారం జ‌ర‌గ‌నున్నమ్యాచ్ భారత్ 950వ వన్డే. ఈ మైలురాయిని అందుకోనున్న తొలి జట్టుగా  భార‌త్ రికార్డు సృష్టించనుంది.
భార‌త్‌ జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌.

.

No comments:

Post a Comment

Post Bottom Ad