విలియంనోర్ధాస్, పాల్‌ రోమర్‌లకు అర్థశాస్త్రంలో నోబెల్‌! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

విలియంనోర్ధాస్, పాల్‌ రోమర్‌లకు అర్థశాస్త్రంలో నోబెల్‌!


అమెరికా ఆర్థిక వేత్తలు విలియం నోర్ధాస్, పాల్‌ రోమర్‌లకు 2018 ఏడాదికి నోబెల్‌ ఆర్థిక శాస్త్ర బహుమతి లభించింది. దీర్ఘకాలిక స్థూల ఆర్థిక విశ్లేషణలకు వాతావరణ మార్పులను జోడించినందుకు నోర్ధాస్‌కు, సాంకేతిక సృజనాత్మకతను జోడించినందుకు రోమర్‌కు ఈ బహుమతి దక్కింది. నోబెల్‌ బహుమతి విలువ 1.01 మిలియన్‌ డాలర్లు కాగా, నోర్ధాస్, రోమర్‌లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటారు. నోర్ధాస్‌ (77) యేల్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉండగా, రోమర్‌ (62) న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ అనుబంధ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో పనిచేస్తున్నారు. రోమర్‌ గతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా కూడా పనిచేశారు. దీంతో ఈ ఏడాది నోబెల్‌ పురస్కారాల విజేతల పేర్లు ప్రకటించడం పూర్తయింది. డిసెంబర్‌ 10న స్టాక్‌హోంలో స్వీడన్‌ రాజు నోబెల్‌ బహుమతులను అందజేస్తారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad