బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రిని తాకిన మీటూ మంటలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 13, 2018

బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రిని తాకిన మీటూ మంటలు!


ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న మీటూ ఉద్యమం సినీ, మీడియా, రాజకీయ రంగాల్లోని ప్రముఖులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. క్రీడా రంగాన్ని సైతం ఈ ఉద్యమం కంపింపజేస్తుంది. రెండు రోజుల క్రితమే శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ, స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగాలు తమతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి లైంగికంగా వేధించాడని ఓ మహిళా జర్నలిస్టు బయటపెట్టింది. ఓ రోజు అతని భార్య, పిల్లలు లేని సమయంలో తనింటికి తీసుకెళ్లి  లైంగికంగా వేధించాడని పేర్కొంది. రాహుల్‌ జోహ్రి బీసీసీఐ సీఈవో కాకముందు డిస్కవరీ చానల్లో పనిచేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad