ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ కొనసాగుతోందని, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయని సినీ నటుడు శివాజీ అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎవరి పాత్ర వారు రక్తికట్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కాగా, కొన్ని నెలల క్రితం కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కుంచుకోవడం కోసం ఆపరేషన్ గరుడ చేపట్టిందని శివాజీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ కొనసాగుతోందని, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయని సినీ నటుడు శివాజీ అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎవరి పాత్ర వారు రక్తికట్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కాగా, కొన్ని నెలల క్రితం కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కుంచుకోవడం కోసం ఆపరేషన్ గరుడ చేపట్టిందని శివాజీ ప్రకటించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment