చత్తీస్గఢ్లో ప్రకాశం జిల్లా వాసుల మృతి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 14, 2018

చత్తీస్గఢ్లో ప్రకాశం జిల్లా వాసుల మృతి!


ప్రకాశం జిల్లాకు చెందిన తొమ్మిది మంది చత్తీస్గఢ్లో భిలాయ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరందరూ చత్తీస్గఢ్లో జరిగిన ఓ శుభాకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా వీరి వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో పెద్ద మంగయ్య, వెంకట లక్ష్మీ, అనూష, ఆది నారాయణ, సావిత్రి, విజయ్‌, నాగమణి, చిట్టి మంజు, వెంకట లక్ష్మీ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన చిట్టిబాబు, వెంకటేశ్వర్లను ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం అనంతరం సొంత గ్రామాలకు తరలించనున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad