కేసీఆర్‌కు మైనార్టీలు బుద్ధి చెప్పాలి: ఉత్తమ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 10, 2018

కేసీఆర్‌కు మైనార్టీలు బుద్ధి చెప్పాలి: ఉత్తమ్


మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ మాజీ నేత ఇబ్రహీం తన అను చరులతో కలసి మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉత్తమ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పి ఇబ్రహీంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. కేసీఆర్‌ ముస్లింలను తీవ్రంగా మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తానని చెప్పి నాలుగేళ్లు అయినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రధాని మోదీకి ప్రతి విషయంలో ఏజెంటుగా పనిచేస్తున్న కేసీఆర్‌ ముస్లింల రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనన్న విషయాన్ని ముస్లిం సోదరులు గమనించాలని కోరారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad