మిత్రపక్షాలకు 20 సీట్లే మాగ్జిమమ్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 10, 2018

మిత్రపక్షాలకు 20 సీట్లే మాగ్జిమమ్!


తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలన్నీ మహా కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే సీట్లు పొత్త విషయం ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించకపోగా పొత్తు పార్టీలు ఎన్ని సీట్లు అడుగుతాయో, ఏయే స్థానాలు అడుగుతాయో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ కంగారు పడుతోంది. సీపీఐ 9 స్థానాలు, తెలంగాణ జనసమితి 18 స్థానాలు, తెలుగుదేశం 20 కంటే ఎక్కువ స్థానాలు కోరగా ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు మిత్రపక్ష పార్టీలకు కలిపి 20 స్థానాల కంటే ఎక్కువ ఇవ్వొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అంటే 99 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీనే పోటీ చేయాలని చూస్తుంది. కానీ మిత్రపక్షాలు అంగీకరిస్తాయో లేదో చూడాలి. 

No comments:

Post a Comment

Post Bottom Ad