అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అత్యవసర విచారణకు సుప్రీం నో - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 10, 2018

అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అత్యవసర విచారణకు సుప్రీం నో


కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష చేయాలంటూ జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షులు శైలజా విజయన్‌ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జడ్జీలు జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారించింది. ఇతర పిటిషన్ల మాదిరిగా దీన్ని కూడా పరిగణిస్తామని దసరా సెలవుల తర్వాతే విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad