కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్‌

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయెల్‌ పరిమితిని సగానికి సగం తగ్గించేసింది. ప్రస్తుతం రూ.40,000 పరిమితి ఉండగా బుధవారం నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మోసపూరిత లావాదేవీలు పెరిగిపోతుండటంతో, కస్టమర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌  ప్రకటించింది. తాజా నిర్ణయం వల్ల మోసగాళ్లు సైతం రోజుకు రూ.20వేల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయలేరు కనక ఒకవేళ ఎవరైనా మోసపోయినా మరీ ఎక్కువ మొత్తాన్ని పోగొట్టుకోకుండా ఉంటారన్నది తమ ఉద్దేశమని బ్యాంకు తెలియజేసింది. రూ.20,000కు మించి విత్‌డ్రాయల్స్‌ కావాలనుకునేవారు హయ్యర్‌ కార్డ్‌ వేరియెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని  ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే గుప్తా తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad