ఒడిశా- ఏపీ తీరంలో తిత్లీ తుపాన్ ముంచుకొస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తిత్లీ తుపాన్ ధాటికి గంటకు 100 నుంచి 110 కిమీ వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం నాటికి తుపాన్ విస్తరించి తీవ్రరూపు దాల్చుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. బుధ, గురువారాల్లో ఒడిశాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్అలర్ట్ జారీ చేసింది. కాగా తిత్లీ ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్ తీరానికి 510 కి.మీ. దూరంలో ఏపీలోని కళింగపట్నం తీరానికి 460 కిలోమీటర్ల దూరం మధ్య కేంద్రీకృతమైంది. అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం తీర ప్రాంత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్పూర్ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది.
ఒడిశా- ఏపీ తీరంలో తిత్లీ తుపాన్ ముంచుకొస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తిత్లీ తుపాన్ ధాటికి గంటకు 100 నుంచి 110 కిమీ వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం నాటికి తుపాన్ విస్తరించి తీవ్రరూపు దాల్చుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. బుధ, గురువారాల్లో ఒడిశాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్అలర్ట్ జారీ చేసింది. కాగా తిత్లీ ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్ తీరానికి 510 కి.మీ. దూరంలో ఏపీలోని కళింగపట్నం తీరానికి 460 కిలోమీటర్ల దూరం మధ్య కేంద్రీకృతమైంది. అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం తీర ప్రాంత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్పూర్ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది.
No comments:
Post a Comment