హత్యాయత్నంలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం వైద్యులు పరిశీలించారు. లోటస్ పాండ్లో ఆయన్ను పరిశీలించిన అనంతరం సిటీ న్యూరో సెంటర్ డాక్టర్ శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. గాయం ఇంకా తగ్గలేదని, పూర్తిగా నయం కావడానికి ఆరువారాల సమయం పడుతుందని చెప్పారు. కోడికత్తితో చేసిన గాయంపై రక్త నమూనాల నివేదిక వచ్చిందని, అందులో ఎలాంటి విష నమూనాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రకు వెళ్లాలనే అభిప్రాయంలోనే ఉన్నారని తెలిపారు. పాదయాత్ర సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు శివారెడ్డి వివరించారు. దీనిపై స్పందించిన పార్టీవర్గాలు పాదయాత్రను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపాయి.
Post Top Ad
Tuesday, October 30, 2018
నోటెన్షన్.. విషం ఆనవాళ్లు లేవు
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment