తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఈ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తారనే అంశాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సీపీఐ, టీజేఎస్ల కూటమికి ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’ అని పేరు పెట్టి దానికి చైర్మన్గా ఆయన్ను ఉంచాలని చూస్తున్నాయి. దీనికి సంబంధించి కోదండరాం పేరును భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి కూడా.
అంతేకాకుండా ప్రొఫెసర్ ఎన్నికల్లో ఒక ప్రాంతం నుంచి పోటీ చేయించకుండా వేదిక పేరుతో రాష్ట్రమంతటా ప్రచారం చేయించాలని కూటమి పార్టీలు కోదండరాంను కోరుతున్నాయి. కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలును పర్యవేక్షించేందుకు వేదిక పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే వేదిక చైర్మన్గా ఉండేందుకు కోదండరాం ఒప్పుకుంటారో లేదో ఆయనే స్వయంగా చెప్పేవరకు ఎదురు చూడాల్సిందే.
No comments:
Post a Comment