తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంటే ప్రతిపక్షాల మహా కూటమి పొత్తులు తేలక సతమతమవుతున్నాయి. ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ చేపట్టిన అధ్యయనం అక్టోబర్ నెలాఖరులో పూర్తవుతుందన్నారు. స్క్రీనింగ్ కమిటీ సంప్రదింపులు ముగిసిన ఒకటి, రెండు రోజుల అనంతరం నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. సామాజికవర్గాలకు న్యాయం జరిగేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంటే ప్రతిపక్షాల మహా కూటమి పొత్తులు తేలక సతమతమవుతున్నాయి. ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తెలిపారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ చేపట్టిన అధ్యయనం అక్టోబర్ నెలాఖరులో పూర్తవుతుందన్నారు. స్క్రీనింగ్ కమిటీ సంప్రదింపులు ముగిసిన ఒకటి, రెండు రోజుల అనంతరం నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. సామాజికవర్గాలకు న్యాయం జరిగేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
No comments:
Post a Comment