పేరం గ్రూప్స్‌పై ఐటీ దాడులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 30, 2018

పేరం గ్రూప్స్‌పై ఐటీ దాడులు

మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం గుంటూరులో తెదేపా నేత ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ వియ్యంకుడుడైన పేరం హరిబాబు చెందిన పేరం గ్రూప్‌ సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని మంజీరా మెజిస్టిక్‌ మాల్‌లోని పేరం గ్రూపు ప్రధాన కార్యాలయంతో పాటు విశాఖ, తిరుపలోని హరిబాబు ఇల్లు, కార్యాలయాల్లో మొత్తం 9 బృందాలు సోదాలు చేస్తున్నాయి. వీటిటో పాటు పేరం గ్రూపునకు చెందిన జీజీఆర్‌ హౌసింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపారానికి, ప్రభుత్వానికి చెల్లించే పన్నులకు వ్యత్యాసం ఉన్నట్లు అనుమానం రావడంతోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad