మాజీ ప్రధానికి జైలు శిక్ష పెంపు.. ఎందుకు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 30, 2018

మాజీ ప్రధానికి జైలు శిక్ష పెంపు.. ఎందుకు?

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియాకు కోర్ట్‌ షాక్‌ ఇచ్చింది. ఓ కేసులో ఆమెకు విధించిన ఐదేళ్ల శిక్షను పదేళ్లకు పెంచుతూ మంగళవారం తీర్పునిచ్చింది. అనాథాశ్రమానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం కేసులో కోర్టు జియాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదేళ్ల శిక్ష విధించింది. ఆమెతో పాటు కుమారుడు తారిక్‌ రెహ్మాన్‌, మరో నలుగురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. శిక్ష పడినప్పటి నుంచి జియా జైల్లోనే ఉన్నారు. డిసెంబరులో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేరని అవినీతి వ్యతిరేక కమిషన్‌ న్యాయవాది కుర్షీద్‌ ఆలం వెల్లడించారు. ఖలీదా జియాపై తాజా తీర్పులతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad