ట్రంప్‌కు తీవ్ర అవమానం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

ట్రంప్‌కు తీవ్ర అవమానం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తీరని అవమానం జరిగింది. గత వారం పిట్స్‌బర్గ్‌లోని యూదుల ప్రార్థనా మందిరం వద్ద ఓ వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లారు. దాడి అనంతరం ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దాడిలో ప్రాణాలు కోల్పోయిన డేనియర్‌ స్టైన్‌ అనే వ్యక్తి కుటుంబం ట్రంప్‌ను కలవడానికి నిరాకరించింది. ఇరు పార్టీలకు చెందిన కాంగ్రెస్‌ సభ్యులు.. సెనేట్‌ మెజార్టీ లీడర్‌ మిచ్‌ మెక్‌కొన్నెల్‌, ప్రతినిధుల సభ స్పీకర్‌ పౌల్‌ రేయాన్‌, ఇతర నేతలు‌ చార్లెస్‌ షమర్‌, నాన్సీ పెలోసి తదితరులు ట్రంప్‌తో కలిసి పిట్స్‌బర్గ్‌ పర్యటనలో పాల్గొనేందుకు నిరాకరించారు. నగర డెమోక్రటిక్‌ మేయర్‌ బిల్‌ పుడోటో కూడా ట్రంప్‌ను కలుసుకోలేదు. కౌంటీ ఎగ్జిక్యూటివ్‌ రిచ్‌ ఫిట్జెరాల్డ్‌ కూడా అధ్యక్షుడి వద్దకు వెళ్లరని మేయర్‌ కార్యాలయం తెలిపింది.

No comments:

Post a Comment

Post Bottom Ad