శబరిమలకు అమిత్‌ షా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 30, 2018

శబరిమలకు అమిత్‌ షా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా త్వరలో శబరిమల ఆలయాన్ని సందర్శించనున్నారు. నవంబర్‌ 17 నుంచి శబరిమలలో వార్షిక యాత్ర ప్రారంభ‍ం కానున్న నేపథ్యంలో అక్కడ పూజలు నిర్వహించనున్నారు. దీనిపై కేరళ బీజేపీ సీనియర్‌ నేత ఒకరు మాట్లాడుతూ శబరిమల ఆలయాన్ని అమిత్‌షా సందర్శించాలనుకుంటున్నారని కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. శబరిమల నిరసనకారులపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని  గత వారం అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పోలీసులు ఇప్పటి వరకు 3,500 మంది నిరసనకారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad