అక్టోబర్ 15న ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 05, 2018

అక్టోబర్ 15న ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు

పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అక్టోబర్ 15 ధవళేశ్వరం బ్యారేజీపై లక్షలాదిమందితో కవాతు నిర్వహించనుంది. ఈ కవాతును ముందు అక్టోబర్ 9న రాజమండ్రి పాత బ్రిడ్జిపై నిర్వహించాలని అనుకోగా లక్షలాది మంది యువత తరలివచ్చే అవకాశం ఉండటంతో బ్రిడ్జి మనుగడను దృష్టిలో పెట్టుకుని ధవళేశ్వరంపై కవాతు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం విజయవాడలో మీడియాకు చెప్పారు. లక్షలాది మంది అభిమానులు కవాతుకు తరలివచ్చే అవకాశం ఉందని, రాజమండ్రి పాత బ్రిడ్జి అంతమందిని తట్టుకునే అవకాశం లేకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజీను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad