విరాట్ కోహ్లీకి ఆ సినిమా అంతబాగా నచ్చిందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

విరాట్ కోహ్లీకి ఆ సినిమా అంతబాగా నచ్చిందా?


ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కిందట రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి విరాట్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా హాజరైంది. కాగా, విశ్రాంతి పేరిట తనకు లబించిన ఈ కొన్ని రోజులను విరాట్ తన భార్య అనుష్క శర్మకు కేటాయించి ఆమెతో సేద తేరుతున్నాడు. ప్రస్తుతం అనుష్క శర్మ, వరుణ్ ధావన్ హీరోహీరోయిన్లుగా విడుదలైన 'సూయిధాగా' చిత్రాన్ని చూసి విరాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమాను ఇప్పటికే రెండుసార్లు చూశానని, మొదటిసారితో పోలిస్తే రెండోసారి మరింత బాగుందని ట్విటర్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా చిత్రంలోని మమత (అనుష్క శర్మ) క్యారెక్టర్ చాలా బాగుందని, తన హృదయాన్ని కొల్లగొట్టిందని తెలిపాడు. మమత పాత్ర చాలా ప్రభావవంతంగా ఉందని, శక్తిమంతంగా ఉందని ట్వీట్ చేశాడు. 'నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను లవ్' అంటూ తన భార్య అనుష్కశర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. చిత్రంలో హీరో వరుణ్ ధావన్, ఇతర తారాగాణం అద్భుతంగా నటించారని పేర్కొన్నాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad