కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి (టీజేఎస్) మహా కూటమిలోని ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో అదికార టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి, సీపీఐ మహాకూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహాకూటమి నేతలు శనివారం హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో సమావేశమయ్యారు. మహాకూటమి నుంచి కోదండరాం తప్పుకుంటున్నారనే వార్తలను ఉత్తమ్ ఖండించారు. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇంకా నిర్ణయించలేదని ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని ఉత్తమ్ చెప్పారు. ఇతర పార్టీలను కూడా మహాకూటమిలోకి ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. కోదండరాం మాట్లాడుతూ టీఆర్ఎస్ ను ఓడించడమే మహాకూటమి ప్రధాన లక్ష్యమని అన్నారు.
కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి (టీజేఎస్) మహా కూటమిలోని ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో అదికార టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి, సీపీఐ మహాకూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహాకూటమి నేతలు శనివారం హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో సమావేశమయ్యారు. మహాకూటమి నుంచి కోదండరాం తప్పుకుంటున్నారనే వార్తలను ఉత్తమ్ ఖండించారు. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇంకా నిర్ణయించలేదని ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని ఉత్తమ్ చెప్పారు. ఇతర పార్టీలను కూడా మహాకూటమిలోకి ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. కోదండరాం మాట్లాడుతూ టీఆర్ఎస్ ను ఓడించడమే మహాకూటమి ప్రధాన లక్ష్యమని అన్నారు.
No comments:
Post a Comment