తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారుచేస్తుండగా విద్యుత్ఘాతం జరిగి చోటు చేసుకున్న పేలుళ్లలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకళ్తే.. రాజమండ్రి లాలాచెరువు సమీపంలోని సుబ్భారావుపేట ఓ పూరింట్లో ముత్యాలరెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు ఏటా దీపావళికి భారీ ఎత్తున బాణసంచా తయారుచేసి విక్రయిస్తుంటాడు. వచ్చే దీపావళి సందర్భంగా బాణసంచా తయారుచేసున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ఘాతం జరిగి భారీగా పేలుడు చోటుచేసుకుంది. ఈ మంటల్లో ముత్యాలరెడ్డి కుటుంబం చిక్కుకుంది. మంటల్లో ముత్యాలరెడ్డి కొడుకు, కోడలు, భార్య అగ్నికీలలకు ఆహుతి అయ్యారు. ముత్యాలరెడ్డి, ఆయన మేనకోడలు రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, తెల్లవారుజామున భారీ పేలుళ్లు సంభవించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. ఏంజరిగిందో తెలియక బిక్కచచ్చిపోయారు. పెద్ద ఎత్తున దావానలంలా మంటలు వ్యాపించడంతో భయపడ్డారు.
Post Top Ad
Saturday, September 22, 2018
Home
Unlabelled
రాజమండ్రిలో విషాదం.. బాణసంచా పేలి ముగ్గురు మృతి
రాజమండ్రిలో విషాదం.. బాణసంచా పేలి ముగ్గురు మృతి
Share This
About Somaraju
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment