తెలంగాణలో జరుగుతుంది అన్నాచెల్లెల యుద్ధం అంటున్న రాములమ్మ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

తెలంగాణలో జరుగుతుంది అన్నాచెల్లెల యుద్ధం అంటున్న రాములమ్మ


వరంగల్ జిల్లాలోని రామన్నగూడెం మా సొంత ఊరంటూ తల్లి తెలంగాణ పార్టీ పెట్టి దాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసి 2009లో మెదక్ ఎంపీగా విజయం సాధించారు.. విజయశాంతి. అప్పట్లో కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ లో ముఖ్య నేతగా ఉంటూ తన హవా కొనసాగించారు. కేసీఆర్ కూడా మొదట్లో ఆమెను సొంత చెల్లెలి మాదిరిగానే ఆదరించారు. రాఖీ కట్టినప్పుడు తన సోదరణీమణుల మాదిరిగానే చీరపెట్టి లక్ష నగదు బహూకరించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల ముందు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరిన రాములమ్మ మెదక్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఈ నాలుగున్నరేళ్లు ఎక్కడా ఆమె కనిపించలేదు. మళ్ల ఇప్పుడు ఎన్నికలు రావడంతో రాములమ్మ తెరపైకొచ్చారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కమిటీల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బాధ్యతలను రాములమ్మ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లోని గాంధీభవన్ కొచ్చిన విజయశాంతి ఎలియాస్ రాములమ్మ తెలంగాణలో జరుగుతుంది అన్నాచెల్లెల మధ్య యుద్ధమని సెలవివ్వడం గమనార్హం. మరి దీనికి కేసీఆర్ అన్న ఏమంటారో.. 

No comments:

Post a Comment

Post Bottom Ad