వరుసగా సంచనల తీర్పులు వెల్లడిస్తున్న సుప్రీంకోర్టు నేడు కూడా ఓ ముఖ్యమైన అంశంలో తీర్పు చెప్పనుంది. కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళలను అనుమతించరనే విషయం తెలిసిందే. అయితే దీన్ని సవాలు చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఆగస్టు 1 నుంచి 8 రోజులపాటు వాదనలు విన్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పును నేడు(శుక్రవారం) వెలువరించనుంది. అయితే ఈ చర్య లింగసమానత్వానికి విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మరి కొందరు కూడా ఇదే విషయమై సుప్రీంలో పిటిషన్లు వేశారు. అయ్యప్పస్వామి 'బ్రహ్మచారి' అని.. అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, పీరియడ్స్ వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో స్పష్టం చేశారు.
వరుసగా సంచనల తీర్పులు వెల్లడిస్తున్న సుప్రీంకోర్టు నేడు కూడా ఓ ముఖ్యమైన అంశంలో తీర్పు చెప్పనుంది. కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళలను అనుమతించరనే విషయం తెలిసిందే. అయితే దీన్ని సవాలు చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఆగస్టు 1 నుంచి 8 రోజులపాటు వాదనలు విన్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పును నేడు(శుక్రవారం) వెలువరించనుంది. అయితే ఈ చర్య లింగసమానత్వానికి విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మరి కొందరు కూడా ఇదే విషయమై సుప్రీంలో పిటిషన్లు వేశారు. అయ్యప్పస్వామి 'బ్రహ్మచారి' అని.. అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, పీరియడ్స్ వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో స్పష్టం చేశారు.
No comments:
Post a Comment