దుబాయ్, అమెరికా, మలేసియా వంటి చోట్ల రేవంత్ రెడ్డికి ఆస్తులున్నాయని ఈ మేరకు ఈడీ నిర్దారణ చేసిందని టీవీ చానళ్లు వార్తా కథనాలను ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డి వియ్యంకుడికి చెందిన కంపెనీలో భారీ అక్రమాలు జరిగాయని మీడియా అంటోంది. అయితే రేవంత్ ఇంటిపై సోదాల విషయంలో ఈడీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
మరోవైపు ఈ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందు వల్లనే అణిచి వేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ దాడులతో రేవంత్ రెడ్డి అరెస్టు కూడా జరుగుతుందా? అనేది చర్చనీయాంశంగా నిలుస్తోంది. ఈ వ్యవహారంలో తనను అరెస్టు చేయవచ్చని రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించాడు.
No comments:
Post a Comment