హైదరాబాద్లో పట్టపగలు నలుగురు కలిసి బుధవారం అత్తాపూర్ వద్ద సిద్ధి అంబర్ బజార్కు చెందిన రమేశ్ (35) దారుణంగా నరికి చంపిన ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే. గతంలో ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం విషయంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా రమేశ్ తన ప్రాణ స్నేహితుడు మహేశ్ గౌడ్ను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ఉప్పరపల్లి కోర్టులో హాజరై ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్న రమేశ్ను నేడు మహేశ్ బంధువులు హత్య చేసినట్లు తెలుస్తుంది. పట్టపగలు, రద్దీగా ఉన్న ప్రాంతంలో రమేశ్ను ఇద్దరు వెంటాడారు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుండగులను అడ్డుకోడానికి ప్రయత్నించారు. గొడ్డలితో వెంటాడుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ లోగా మరో వ్యక్తి రమేశ్ను గొడ్డలితో నరికాడు. కానిస్టేబుల్ను విదిలించుకుని వచ్చిన వ్యక్తి ప్రాణం పోయే వరకు నరుకుతూనే ఉన్నాడు.
హైదరాబాద్లో పట్టపగలు నలుగురు కలిసి బుధవారం అత్తాపూర్ వద్ద సిద్ధి అంబర్ బజార్కు చెందిన రమేశ్ (35) దారుణంగా నరికి చంపిన ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే. గతంలో ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం విషయంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా రమేశ్ తన ప్రాణ స్నేహితుడు మహేశ్ గౌడ్ను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ఉప్పరపల్లి కోర్టులో హాజరై ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్న రమేశ్ను నేడు మహేశ్ బంధువులు హత్య చేసినట్లు తెలుస్తుంది. పట్టపగలు, రద్దీగా ఉన్న ప్రాంతంలో రమేశ్ను ఇద్దరు వెంటాడారు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుండగులను అడ్డుకోడానికి ప్రయత్నించారు. గొడ్డలితో వెంటాడుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ లోగా మరో వ్యక్తి రమేశ్ను గొడ్డలితో నరికాడు. కానిస్టేబుల్ను విదిలించుకుని వచ్చిన వ్యక్తి ప్రాణం పోయే వరకు నరుకుతూనే ఉన్నాడు.
No comments:
Post a Comment