ముస్లిం మహిళల హక్కుల కోసం ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరేందుకు ప్రయత్నించామని, ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మౌనంగా ఉన్నారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వడంలేదని మండిపడ్డారు. సుప్రీం కోర్టు జోక్యం తర్వాత దేశవ్యాప్తంగా 430 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటి పరిష్కారం చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకే ఆర్డినెన్స్ తెచ్చామని వివరించారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఈ కేసులు నమోదయ్యాయన్నారు.
ముస్లిం మహిళల హక్కుల కోసం ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరేందుకు ప్రయత్నించామని, ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మౌనంగా ఉన్నారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతివ్వడంలేదని మండిపడ్డారు. సుప్రీం కోర్టు జోక్యం తర్వాత దేశవ్యాప్తంగా 430 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటి పరిష్కారం చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకే ఆర్డినెన్స్ తెచ్చామని వివరించారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఈ కేసులు నమోదయ్యాయన్నారు.
No comments:
Post a Comment