నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆయుష్మాన్ భారత్ ప్రారంభం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 23, 2018

నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆయుష్మాన్ భారత్ ప్రారంభం


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.. ఆయుష్మాన్ భారత్. నేషనల్ హెల్త్ ఏజెన్సీ ద్వారా కేంద్రం అమలు చేసే ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ నేడు జార్ఖండ్ లో ప్రారంభించనున్నారు. ఏడాదికి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున దేశంలోని 10 కోట్ల మంది పేదలకు ఈ పథకం కింద లబ్ధి కలుగుతుంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. వారి వయసుతో పనిలేకుండా ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వివిధ వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందొచ్చు. ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డు ఉండాలి. ఆధార్ లేకపోయినా ఫరవాలేదు. ఈ పథకంలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నేషనల్ హెల్త్ ఏజెన్సీ ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను రూపొందించింది. ఏమైనా సందేహాలుంటే ఆ పోర్టల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు లేదా 14555 నంబర్ కు ఫోన్ చేయొచ్చు.


No comments:

Post a Comment

Post Bottom Ad