ఈ ఏడాది 'మహానటి'లో నటించి సంచలన విజయం సాధించింది.. ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్. ప్రస్తుతం ఈ భామ కోలీవుట్ నటుడు విశాల్ తో కలసి పందెంకోడి-2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను రేపు (శనివారం) హైదరాబాద్ లోని దసపల్లా కన్వెన్షన్ లో మధ్యాహ్నం 1 గంటకు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరవడానికి, హీరో విశాల్ ను, హీరోయిన్ కీర్తి సురేశ్ ను కలవడానికి ఉచిత పాస్ లు కావాలంటే.. లైక్, షేర్, కామెంట్, స్ర్కీన్ షాట్ తీసి తమకు పంపాలని ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా ట్విట్టర్ లో పేర్కొంది.
కాగా, మీరా జాస్మిన్ హీరోయిన్ గా వచ్చిన మొదటి పందెంకోడి తమిళం, తెలగు భాషల్లో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అభిమన్యుడు సినిమాతో ఈ ఏడాది తెలుగు, తమిళంలో భారీ హిట్ దక్కించుకున్న విశాల్.. పందెంకోడి-2తో మరో భారీ హిట్ పై కన్నేశాడు.
No comments:
Post a Comment