ఆన్లైన్ లో అందమైన అమ్మాయిలను ఫొటోలను చూపించి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు రూ.21.28 లక్షలు దండుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కూడా అంతకుముందు ఆన్లైన్ లో ఇలాగే మోసపోవడం గమనార్హం. వివరాల్లోకెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ఆన్లైన్ లో అందమైన యువతుల ఫొటోలు ఉంచి వారిని కోరుకున్న చోటకు పంపిస్తానంటూ కింద కాంటాక్ట్ నెంబర్లను ఉంచాడు. గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఒక అమ్మాయిని బుక్ చేసుకుని రూ.17,000 ఆన్లైన్ లో చెల్లించాడు. ఆ తర్వాత వెబ్ సైట్ లో సూచించిన నెంబర్ కు ఫోన్ చేయగా అతడి నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో అతడు మోసపోయానని గ్రహించి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుంటూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో బసచేసేందుకు యత్నించిన యువకుడిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజాలు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపనపల్లికి చెందిన వీరంరెడ్డి సుమన్రెడ్డి బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఉంటున్నాడు. ఆన్లైన్లో యువతులను బుక్ చేసుకుని అక్కడ మోసపోయాడు. అదే విధానంలో తాను కూడా చేయవచ్చని ఆర్నెల్ల నుంచి అందమైన యువతుల ఫొటోలను పెట్టి ఇప్పటివరకు 507 మందిని మోసం చేసి రూ.21.28 లక్షల డబ్బును కాజేశాడు. అతని వద్ద ఉన్న రూ.8 లక్షల నగదు, కారు, ల్యాప్ట్యాప్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు వివరించారు.
ఆన్లైన్ లో అందమైన అమ్మాయిలను ఫొటోలను చూపించి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు రూ.21.28 లక్షలు దండుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కూడా అంతకుముందు ఆన్లైన్ లో ఇలాగే మోసపోవడం గమనార్హం. వివరాల్లోకెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ఆన్లైన్ లో అందమైన యువతుల ఫొటోలు ఉంచి వారిని కోరుకున్న చోటకు పంపిస్తానంటూ కింద కాంటాక్ట్ నెంబర్లను ఉంచాడు. గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఒక అమ్మాయిని బుక్ చేసుకుని రూ.17,000 ఆన్లైన్ లో చెల్లించాడు. ఆ తర్వాత వెబ్ సైట్ లో సూచించిన నెంబర్ కు ఫోన్ చేయగా అతడి నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో అతడు మోసపోయానని గ్రహించి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుంటూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో బసచేసేందుకు యత్నించిన యువకుడిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజాలు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపనపల్లికి చెందిన వీరంరెడ్డి సుమన్రెడ్డి బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఉంటున్నాడు. ఆన్లైన్లో యువతులను బుక్ చేసుకుని అక్కడ మోసపోయాడు. అదే విధానంలో తాను కూడా చేయవచ్చని ఆర్నెల్ల నుంచి అందమైన యువతుల ఫొటోలను పెట్టి ఇప్పటివరకు 507 మందిని మోసం చేసి రూ.21.28 లక్షల డబ్బును కాజేశాడు. అతని వద్ద ఉన్న రూ.8 లక్షల నగదు, కారు, ల్యాప్ట్యాప్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు వివరించారు.
No comments:
Post a Comment