తనుశ్రీ దత్తాపై కేసు వేస్తానంటున్న నానా పటేకర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

తనుశ్రీ దత్తాపై కేసు వేస్తానంటున్న నానా పటేకర్


ప్రముఖ నటుడు నానాపటేకర్ గతంలో ఒక చిత్రం సినిమా షూటింగ్ సందర్భంగా లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. తను శ్రీ ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్ ను ఒక కుదుపు కుదుపుతున్నాయి. సోనమ్ కపూర్, పరిణితి చోప్రా, రవీనాటాండన్, ప్రియాంకా చోప్రా లాంటి భామామణులు, ఫర్హాన్ అక్తర్ లాంటి హీరోలు తనుశ్రీ దత్తాకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే తొలిసారిగా తనుశ్రీ దత్తా ఆరోపణలపై నానాపటేకర్ స్పందించారు. తనుశ్రీ దత్తా అబద్ధం ఆడుతోందని, ఆ రోజు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు 100 నుంచి 120 మంది వరకు యూనిట్ సభ్యులున్నారని, అలాంటప్పుడు లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అంతేకాకుండా తనుశ్రీ దత్తాపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తనుశ్రీ దత్తా ఆరోపణలను ఖండించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad