తాడిపత్రిలో ఆందోళన విరమించిన ఎంపీ జేసీ దివాకరరెడ్డి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 17, 2018

తాడిపత్రిలో ఆందోళన విరమించిన ఎంపీ జేసీ దివాకరరెడ్డి

mp-jc-diwakar-reddy-fires-on-anantapur-police-over-vinayaka-immersion-stir-at-tadipatri

నిన్నటి నుంచి తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఆందోళన విరమించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని చిన్నపొలమడలో స్వామి ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులకు, గ్రామస్తులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వినాయక నిమజ్జనం సందర్భంగా మొదలైన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. వందలాది వాహనాలు ఇరు వర్గాల దాడుల్లో ధ్వంసమవగా ఒక వ్యక్తి మృతి చెందాడు. పదుల సంఖ్యలో గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ వీరపాండ్యన్‌, పాలీస్‌ ఉన్నతాధికారులు ఆశ్రమ నిర్వాహకులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆశ్రమంలో ఉన్న స్థానికేతరులు అక్కడి నుంచి వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని సుమారు 30 గంటలుగా చేస్తున్న ఆందోళనను అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి విరమించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆశ్రమ భక్తులు ఈరోజు విశాఖపట్నం జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ను కలిసి న్యాయం చేయాలని విన్నవించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad