మొబైల్ ఫోన్ల ద్వారా కంటికి కలిగే నష్టం తెలుసా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 13, 2018

మొబైల్ ఫోన్ల ద్వారా కంటికి కలిగే నష్టం తెలుసా?


ఆధునిక ప్రపంచంలో సమస్త సమాచారం మన చేతిలోనే ఉందనుకుంటాం. ఒక్క స్మార్ట్ మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలా అదే ప్రపంచాన్ని జయించినట్లుగా ఫోజులిస్తాం. నిత్యం చాటింగ్, వీడియో వాచింగ్తో తలమునకలై పోతాం. అక్కడితో ఆగకుండా చిన్న పనికి సైతం దానిమీదే ఆధారపడిపోతుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్లు మన జీవితాల్లోనే కాదు మన శరీరంలోనూ భాగమయ్యాయమంటే అతిశయోక్తి కాదు. కాలు కదపకుండా కావాల్సిన సమాచారం అందించే ఈ ఫోన్లతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతే దుష్ప్రయోజనాలూ వెంటాడుతున్నాయి. అతిగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్‌లు వాడడం వల్ల మన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి  కళ్లు పొడిబారిపోతున్నాయి.  తద్వారా కంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగినట్లుగా అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. ప్రతీ పదిమందిలో ఏడుగురు ‘డిజిటల్‌ విజన్‌ సిండ్రోమ్‌’తో బాధ పడుతున్నట్లుగా వైద్యునిపుణులు చెబుతున్నారు. మనదేశంలో సగటున రెండు గంటల 39 నిమిషాల పాటు మొబైల్‌ ఫోన్‌ను వాడుతున్నట్లుగా ఈ ఏడాది నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఆఫీసులో ఉద్యోగి రోజుకు  ఆరున్నర గంటల పాటు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ను వాడుతున్నట్లుగా మరో సంస్థ వెల్లడించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad