కిడారికి చంద్రబాబు రూ.12 కోట్లు ఇచ్చారా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 27, 2018

కిడారికి చంద్రబాబు రూ.12 కోట్లు ఇచ్చారా?



గత ఆదివారం విశాఖ జిల్లా మన్యంలో మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అయితే చంపడానికి ముందు మావోలు వారితో ఏం మాట్లాడారనేదానిపై ఇప్పటివరకు వివరాలు వెల్లడి కాలేదు. తాజాగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మావోయిస్టులు చంపడానికి ముందు కిడారిని పలు ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా 'పార్టీ మారినందుకు బాగానే గిట్టుబాటు అయ్యిందిగా.. మరి ఎందుకు బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నావు' అని అడగ్గా కిడారి 'రెండు రోజులు సమయం ఇవ్వండి. అన్నీ ఆపేస్తాను. ఇక నుంచి ఏ తప్పూ చేయను.. రాజకీయాల నుంచి విరమించుకుంటాను' అని చెప్పారు. అదేవిధంగా పార్టీ మారినందుకు ఎంత ఇచ్చారని అడగ్గా.. కిడారి మౌనం వహించారు. మావోయిస్టులు గద్దించి అడగ్గా రూ.12 కోట్లు ఇచ్చారని, మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టేందుకు చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేశ్ లైసెన్సులు ఇప్పించారని చెప్పినట్టు తెలుస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad