మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'రచ్చ' ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి.. ఆ సినిమా హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నాపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తమన్నా డ్యాన్సులకు తాను ఫిదా అయ్యానని, తమన్నా హీరోయిన్ గా, తాను హీరోగా ఒక సినిమా చేయాలనుందని వెల్లడించిన సంగతి విదితమే. అంతేకాకుండా తమన్నా ఇక్కడుందని తాను ఇలా అనడం లేదని.. తమన్నా లేకపోయినా ఇదే మాట చెబుతానంటూ చెప్పడం విశేషం. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు ఒక తెలుగు టీవీ చానెల్ లో నిర్వహించిన 'సౌందర్యలహరి' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా సందడి చేశారు. అప్పుడు కూడా చిరంజీవి తమన్నా డ్యాన్సులపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో నాడు తానిచ్చిన మాటను మెగాస్టార్ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నిలబెట్టుకున్నారు. సైరా తర్వాత ప్రారంభమయ్యే కొత్త చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. కొణిదెల ప్రో కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. అతి త్వరలోనే మనం మెగాస్టార్ స్టెప్పులకు, మిల్కీ బ్యూటీ నడుమందాలకు రెండు కళ్లు అప్పగించాల్సిందే..!
No comments:
Post a Comment