ఉమ్మడి వరంగ్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు కొండా సురేఖ, మురళీ దంపతులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్లో తమకు టికెట్ కేటాయించలేదని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్పై తీవ్రంగా ధ్వజమెత్తిన తర్వాత రోజే కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే టికెట్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో అవమానం ఎదురైన నేపథ్యంలో ముందుగా తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే వారు పార్టీలో చేరినట్టు సమాచారం. అంతేకాకుండా రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం కూడా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కుటుంబానికి అండగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కొండాదంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె ప్రభావం ఉంటుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారని సమాచారం.
ఉమ్మడి వరంగ్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు కొండా సురేఖ, మురళీ దంపతులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్లో తమకు టికెట్ కేటాయించలేదని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్పై తీవ్రంగా ధ్వజమెత్తిన తర్వాత రోజే కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే టికెట్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో అవమానం ఎదురైన నేపథ్యంలో ముందుగా తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే వారు పార్టీలో చేరినట్టు సమాచారం. అంతేకాకుండా రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం కూడా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కుటుంబానికి అండగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కొండాదంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె ప్రభావం ఉంటుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారని సమాచారం.
No comments:
Post a Comment