ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో చెప్పనంటున్న జానారెడ్డి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో చెప్పనంటున్న జానారెడ్డి


తెలంగాణలో తాజా మాజీ ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో ఇప్పుడే చెప్పనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించేవరకు ఎదురుచూడాల్సిందేనని తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన ఈసారి మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి నల్లమోతు భాస్కరరావు గెలిచారు. జానారెడ్డే పట్టుబట్టి భాస్కరరావుకి సీటు ఇప్పించారు. కాంగ్రెస్ అధిష్టానం సీటు ఇవ్వడానికి ఆలోచించినప్పటికీ ఆయన్ను గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి మరీ జానారెడ్డి తన సన్నిహితుడైన భాస్కరరావును గెలిపించడం గమనార్హం. ఒకవేళ ఈసారి జానారెడ్డి మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తే భాస్కరరావుకు సీటు గల్లంతవుతుంది లేదా జానారెడ్డి గెలిచిన నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad