అమృతను కలిసిన జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 26, 2018

అమృతను కలిసిన జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ



జబర్దస్త్ కామెడీ షో నటుడు కిర్రాక్ ఆర్పీ ఈ రోజు మిర్యాలగూడలో అమృతను కలిసి పరామర్శించారు. స్నేహితులతో కలిసి కారులో నెల్లూరు వెళ్తున్న ఆయన మిర్యాలగూడ మీదుగా వెళ్తూ పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృతను, వారి తల్లిదండ్రులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆధునిక కాలంలోనూ ప్రేమ వివాహం చేసుకున్నారని ఇలాంటి పరువు హత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ఈ సందర్భంగా ఆర్పీ అన్నారు. తన కూతురి భర్తను హత్య చేయించిన మారుతీరావు ఏం బావుకున్నాడని మండిపడ్డారు. ప్రేమికులను విడదీసిన పాపం ఊరికే పోదని శాపనార్థాలు పెట్టారు. ఈ సందర్భంగా అమృత జరిగిన సంఘటనను ఆర్పీకి వివరించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad