శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని ఒప్పుకోని మహిళా న్యాయమూర్తి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 28, 2018

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని ఒప్పుకోని మహిళా న్యాయమూర్తి!


శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం 4 - 1 మెజారిటీతో ఈ తీర్పు వెలువడింది. అంటే నలుగురు న్యాయమూర్తులు ఈ తీర్పుతో  ఏకీభవించగా, మరో న్యాయమూర్తి ఈ తీర్పును అంగీకరించలేదు. ఆమే మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా. మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు అడ్డుకోకూడదంటూ ఆమె ఈ తీర్పును వ్యతిరేకించారు. అంతేకాకుండా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం గురించి ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. అంతేకాక కేరళలో మహిళలు వారి విద్యాభ్యాసం కారణంగా సామాజికంగా పురోభివృద్ధి సాధించారని.. వీరిలో ఎక్కువ మంది శబరిమలలో ఆచరించే పద్ధతులకు వ్యతిరేకంగా లేరని కుండ బద్ధలు కొట్టారు. అయితే ప్రజాస్వామ్య భారతదేశంలో ధర్మాసనం 4 - 1 మెజారిటీతో ఇచ్చే తీర్పే ఫైనల్!

No comments:

Post a Comment

Post Bottom Ad