ఇండోనేసియాను భారీ భూకంపం, సునామీ కలిసి కుదేలు చేశాయి. భూకంపం సంభవిస్తోందని ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న సమయంలోనే సునామీ విరుచుకుపడింది. సులవేసి ద్వీపంలో సముద్రతీరంలోని పలూ పట్టణం నేలమట్టమైంది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ వెంటనే 4–6 మీటర్ల ఎత్తు రాకాసి అలలతో సునామీ విరుచుకుపడింది. శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. భూకంపం, సునామీ ధాటికి 400 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఇండోనేసియాను భారీ భూకంపం, సునామీ కలిసి కుదేలు చేశాయి. భూకంపం సంభవిస్తోందని ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న సమయంలోనే సునామీ విరుచుకుపడింది. సులవేసి ద్వీపంలో సముద్రతీరంలోని పలూ పట్టణం నేలమట్టమైంది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ వెంటనే 4–6 మీటర్ల ఎత్తు రాకాసి అలలతో సునామీ విరుచుకుపడింది. శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. భూకంపం, సునామీ ధాటికి 400 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
No comments:
Post a Comment