ఎట్టకేలకు సురక్షితంగా చెన్నై చేరుకున్న హీరో కార్తీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 25, 2018

ఎట్టకేలకు సురక్షితంగా చెన్నై చేరుకున్న హీరో కార్తీ


సినిమా షూటింగ్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లోని కులు - మనాలి ప్రాంతానికి వెళ్లిన తమిళ హీరో కార్తీ సురక్షితంగా చెన్నై చేరుకున్నాడు. భారీగా కురుస్తున్న వర్షాలతో బియాస్ నది అత్యంత ప్రమాదకరంగా మారిందని, రవాణా వ్యవస్థ స్తంభించిందని, తినడానికి తిండి కూడా లేదని నిన్న కార్తీ సోషల్ మీడియాలో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రోజు తనతోపాటు చిత్ర యూనిట్ కు సంబంధించిన మరికొంతమంది సురక్షితంగా చెన్నై చేరుకున్నామని కార్తీ ట్విట్టర్ లో తెలపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇంకా సినిమా డైరెక్టర్, కెమెరామెన్ తోపాటు చిత్ర యూనిట్ అక్కడే ఉండిపోయారని, అయితే వారంతా భద్రంగా ఉన్నట్టు కార్తీ ట్వీట్ చేశాడు. త్వరలోనే వర్షాలు తగ్గిపోయి యథాతథ పరిస్థితి నెలకొనాలని ఈ హీరో ఆశించాడు. కాగా, దేవ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad