టీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 29, 2018

టీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం


టీఆర్ఎస్ ముఖ్య నేత, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సంగారెడ్డిలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తుండగా కార్యకర్తలు భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. దీంతో టపాసులు పేలి సమీపంలోని వాహనాలపై ఉన్న కార్యకర్తలపై పడ్డాయి. దీంతో కార్యకర్తలు హాహాకారాలు చేస్తూ నలుదిశలా పరుగులు తీశారు. ఒక్కసారిగా భారీ ఎత్తున్న చెలరేగిన పొగలో హరీశ్ చిక్కుకున్నారు. ఏంజరుగుతుందో అర్థం కాని గన్ మెన్లు హరీశ్ కు రక్షణగా నిలిచి మంత్రిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. కాగా, తాను క్షేమంగానే ఉన్నానని పార్టీ నేతలు, అనుచరులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని ట్విట్టర్ లో హరీశ్ రావు కోరారు.


No comments:

Post a Comment

Post Bottom Ad