అయితే అల్లుడికోసం కూడా త్యాగం చేయడానికి బాలయ్య సిద్ధంగా లేడని.. తనే హిందూపురం నుంచి బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాల మధ్యన చంద్రబాబు, బాలయ్యల మధ్యన కోల్డ్ వార్ మొదలైందని టాక్ వినిపిస్తోంది.
హిందూపురం తనది అని బాలయ్య బాబుకు గట్టిగా చెప్పాలని అనుకుంటున్నాడని.. అందుకే హిందూపురంలో తాజాగా ఓటు హక్కును కూడా నమోదు చేయించుకున్నాడని సమాచారం. ఇన్నాళ్లూ బాలయ్య ఓటు హక్కు హైదరాబాద్ లో ఉండేది, ఇప్పుడు దాన్ని హిందూపురానికి మార్పించుకున్నాడు. తద్వారా తను హిందూపురంలోనే ఉంటానని చంద్రబాబుకు కూడా తేల్చి చెప్పినట్టుగా ఉన్నాడు బాలయ్య. అయితే బాలయ్య విజయవాడ ఏరియాకు వెళ్లి పోటీ చేసుకోవాలని.. హిందూపురం నుంచి మాత్రం బాలయ్య అల్లుడుకు ఛాన్స్ ఇవ్వాల్సిందేనని చంద్రబాబు నాయుడు అంటున్నాడట.
No comments:
Post a Comment