కశ్మీర్లో లోయలో పడిన బస్సు, 13 మంది దుర్మరణం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 14, 2018

కశ్మీర్లో లోయలో పడిన బస్సు, 13 మంది దుర్మరణం!

accident-in-kashmir-13-dead

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌తో పాటు 60 మందికి పైగా ప్రాణాలు కొల్పోయి, మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు అలాంటిదే మరో ప్రమాదం జమ్మూ, కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒక మినీ బస్సు లోయలోకి పడిపోవడంతో 13 మంది చనిపోగా, మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు.

accident-in-kashmir-13-dead
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ రాజిందర్ గుప్తా అందించిన సమాచారం ప్రకారం కాశ్వాన్ నుంచి కిష్త్వార్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మినీ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం చెనాబ్ నది సమీపంలో 300అడుగుల  లోతు లోయలోకి పడిపోయింది.  బస్సులో మొత్తం  30మంది ప్రయాణీకులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని హెలికాప్టర్‌ ద్వారా ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేస్తున్నామని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రాణా  ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయినవారికి 5లక్షల రూపాయలు, క్షతగాత్రులకు  50వేల  రూపాయల పరిహారాన్నిప్రకటించారు. ప్రమాదంపై పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్‌పోర్టేషన్ కమిషనర్ ఎస్పీ వాయిద్‌  ట్విటర్‌లో సంతాపం తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad