సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లయిన బాలీవుడ్ భామ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, September 17, 2018

సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లయిన బాలీవుడ్ భామ!



ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన కౌబాయ్ చిత్రం 'టక్కరి దొంగ' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ లీసారే గుర్తుందిగా. టాలీవుడ్ లో ఆ ఒక్క చిత్రంలో మాత్రమే నటించిన లీసారే తర్వాత బాలీవుడ్ చిత్రాలకు, మోడల్ గా మాత్రమే పరిమితమైంది. టాప్ మోడల్ గా ఆమెకు పేరుంది. తర్వాత క్యాన్సర్ బారినపడి కోలుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లయింది. ఈ సందర్భంగా తన పిల్లలిద్దరిని తన పక్కన పడుకోబెట్టుకుని సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని పోస్టు చేసింది. ఇద్దరు ఆడ కవల పిల్లలతోనే తన సమయమంతా గడిచిపోతోందని మురిసిపోతోంది. వారిద్దరికి పాలు పట్టడం, డైపర్లు మార్చడం, సాన్నం చేయించడం తనకెంతో ఆనందిస్తున్నాయని చెబుతోంది.. ఈ భామ.

No comments:

Post a Comment

Post Bottom Ad