ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన కౌబాయ్ చిత్రం 'టక్కరి దొంగ' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ లీసారే గుర్తుందిగా. టాలీవుడ్ లో ఆ ఒక్క చిత్రంలో మాత్రమే నటించిన లీసారే తర్వాత బాలీవుడ్ చిత్రాలకు, మోడల్ గా మాత్రమే పరిమితమైంది. టాప్ మోడల్ గా ఆమెకు పేరుంది. తర్వాత క్యాన్సర్ బారినపడి కోలుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లయింది. ఈ సందర్భంగా తన పిల్లలిద్దరిని తన పక్కన పడుకోబెట్టుకుని సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని పోస్టు చేసింది. ఇద్దరు ఆడ కవల పిల్లలతోనే తన సమయమంతా గడిచిపోతోందని మురిసిపోతోంది. వారిద్దరికి పాలు పట్టడం, డైపర్లు మార్చడం, సాన్నం చేయించడం తనకెంతో ఆనందిస్తున్నాయని చెబుతోంది.. ఈ భామ.
ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన కౌబాయ్ చిత్రం 'టక్కరి దొంగ' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ లీసారే గుర్తుందిగా. టాలీవుడ్ లో ఆ ఒక్క చిత్రంలో మాత్రమే నటించిన లీసారే తర్వాత బాలీవుడ్ చిత్రాలకు, మోడల్ గా మాత్రమే పరిమితమైంది. టాప్ మోడల్ గా ఆమెకు పేరుంది. తర్వాత క్యాన్సర్ బారినపడి కోలుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లయింది. ఈ సందర్భంగా తన పిల్లలిద్దరిని తన పక్కన పడుకోబెట్టుకుని సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని పోస్టు చేసింది. ఇద్దరు ఆడ కవల పిల్లలతోనే తన సమయమంతా గడిచిపోతోందని మురిసిపోతోంది. వారిద్దరికి పాలు పట్టడం, డైపర్లు మార్చడం, సాన్నం చేయించడం తనకెంతో ఆనందిస్తున్నాయని చెబుతోంది.. ఈ భామ.
No comments:
Post a Comment