ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో సంభవించిన భారీ భూకంపం, సునామీ విపత్తు ధాటికి మరణించినవారి సంఖ్య 850కి చేరింది. రెండు రోజుల కిందట రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో తలెత్తిన ఈ భూకంపంతో ఇండోనేసియా చిగురుటాకులా వణికిన సంగతి తెలిసిందే. సునామీ ధాటికి పలు భవనాలు కుప్పకూలగా మొదటి రోజు శిథిలాల కింద 350 మంది మరణించారు. కాగా, శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు క్షతగాత్రుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంది.
ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో సంభవించిన భారీ భూకంపం, సునామీ విపత్తు ధాటికి మరణించినవారి సంఖ్య 850కి చేరింది. రెండు రోజుల కిందట రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో తలెత్తిన ఈ భూకంపంతో ఇండోనేసియా చిగురుటాకులా వణికిన సంగతి తెలిసిందే. సునామీ ధాటికి పలు భవనాలు కుప్పకూలగా మొదటి రోజు శిథిలాల కింద 350 మంది మరణించారు. కాగా, శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు క్షతగాత్రుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంది.
No comments:
Post a Comment