వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాయలసీమలో 24 మంది సీఐల బదిలీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాయలసీమలో 24 మంది సీఐల బదిలీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా ఆదివారం రాయలసీమలో మొత్తం 24 మంది సీఐలను బదిలీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారికి పోస్టుల్లో ప్రాధాన్య విభాగాలు దక్కినట్టు సమాచారం అందుతోంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన సీఐలను అప్రాధాన్య విభాగాలకు బదిలీ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. కాపు సామాజికవర్గమే లక్ష్యంగా బదిలీలు జరిగినట్టు అధికారులు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఈ బదిలీలు చేయడం గమనార్హం. కాపు సామాజికవర్గంతోపాటు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులను కూడా అప్రాధాన్య విభాగాలకు బదిలీ చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad