సిమ్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 22, 2018

సిమ్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి


హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో విషాదం చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ప్రయాణికులతో బయలుదేరిన జీపు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు మహిళలు, ఓ చిన్నారి సహా 13 మంది మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిని సిమ్లాలోని రోహ్రు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో జీపు తుక్కుతుక్కు అయ్యింది. స్పాట్ లోనే పది మంది చనిపోయారని, మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని పోలీసులు వెల్లడించారు. కొండలు, గుట్టలతో అత్యంత ప్రమాదకరంగా ఉండే హిమాచల్ ప్రదేశ్ లో ఈ ఏడాది అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత నెలలోనూ కొండపై నుంచి కారు పడిపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad