ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడి జై సమైక్యాంధ్ర అనే సొంత పార్టీని పెట్టి తీవ్ర ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఓటమి తర్వాత దాదాపు నాలుగేళ్లు ఎలాంటి రాజకీయ చలనం లేకుండా స్తబ్ధుగా ఉన్నటువంటి ఆయన పేరు మళ్లీ రాజకీయాల్లో వినిపిస్తుండటం విశేషం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడు ఏ మాత్రం ప్రజాదరణ లేకుండా ఒంటరిగా మిగిలిపోవడం ఈయనకే చెల్లిందని చెప్పొచ్చు. అయినప్పటికీ దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ చర్యలు ఊపందుకున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిని సంప్రదించినట్లు సమాచారం.
అయితే సమయం వచ్చినప్పుడు ఏ పార్టీలో చేరుతాననే విషయం చెప్తానని కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ కావడం కూడా ఆయన కాంగ్రెస్ లో చేరుతాడనే వాదనలు బలపడుతున్నాయి. అంతేకాకుండా కిరణ్కుమార్ రెడ్డిని తాము వేరే వ్యక్తిగా భావించడం లేదని, కాంగ్రెస్ కుటుంబంలో ఒక సభ్యునిగానే గుర్తిస్తున్నామని కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు ఓపెన్ వెల్ కమ్ చెబుతున్నారు.
No comments:
Post a Comment